టీఎ్‌సఆర్‌టీసీకి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు: స్విచ్‌ మొబిలిటీ

ABN , First Publish Date - 2023-02-07T02:45:49+05:30 IST

అశోక్‌ లేలాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టనుంది...

టీఎ్‌సఆర్‌టీసీకి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు: స్విచ్‌ మొబిలిటీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అశోక్‌ లేలాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రవేశపెట్టనుంది. పర్యావరణ అనుకూల పబ్లిక్‌ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని స్విచ్‌ మొబిలిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ఎస్‌ మహేశ్‌ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్‌టీసీ)కి 500 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయనున్నాం. బస్సుల సరఫరా వచ్చే ఆరు నెలల్లో ప్రారంభమవుతుంది. ఏడాదిలో ముగుస్తుంది. కన్వరెజెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులను సరఫరా చేయడానికి ఎల్‌ 1 బిడ్డర్‌గా ఎంపిక అయ్యాం. మొత్తం బస్సుల నిర్వహణకు తెలంగాణలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టన్నుట్లు మహేశ్‌ బాబు చెప్పారు.

Updated Date - 2023-02-07T02:45:51+05:30 IST