డివిడెండ్ల ద్వారా రూ.48,000 కోట్లు

ABN , First Publish Date - 2023-02-02T03:34:14+05:30 IST

ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా డివిడెండ్ల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.48,000 కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు...

డివిడెండ్ల ద్వారా రూ.48,000 కోట్లు

ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా డివిడెండ్ల రూపంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.48,000 కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలవుతుందనుకుంటున్న రూ.40,953 కోట్ల కన్నా బడ్జెట్‌లో ప్రకటించిన అంచనా దాని కన్నా 17 శాతం అధికం. వాస్తవానికి ఈ ఏడాది డివిడెండ్ల రూపంంలో రూ.73,948 కోట్ల వసూలు లక్ష్యాన్ని గత బడ్జెట్‌ అంచనాల్లో ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్‌ రూపంలో రూ.43,000 కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది మొత్తానికి డివిడెండ్ల రూపంలో మొత్తం వసూళ్లు రూ.1,15,820 కోట్లు అవుతుంది. 2022-23 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ అంచనా రూ.1,08,592 కోట్లు.

Updated Date - 2023-02-02T03:34:16+05:30 IST