ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర

ABN , First Publish Date - 2023-02-02T02:55:43+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ విశాఖపట్టణం పోయేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు.

 ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌

కడప, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌ విశాఖపట్టణం పోయేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. ఆయన అక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. కానీ రాజధాని విశాఖపట్టణం అని ఎలా చెబుతారు? రాజధాని జగన్‌ సొంత జాగీరా? అదేమైనా ఆయన ఇల్లు అనుకున్నాడా? ప్రజల మఽఽధ్య చిచ్చుపెట్టేందుకు వైపీపీ కుట్ర చేస్తోంది’’ అంటూ సీపీయం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ మండిపడ్డారు. బుధవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని అన్నిపార్టీలు కలిసి చర్చించి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఎక్కడ ఉండాలో ఒక నిర్ణయం తీసుకుంటామని, ఇది ఎవరి జాగీరు కాదని రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన టీడీపీయేతర ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారని, మూడు జిల్లాల కోస్తాంధ్ర పేరుతో రాష్ట్రం కావాలని కోరడం అన్యాయమని గఫూర్‌ అన్నారు.

Updated Date - 2023-02-02T02:55:44+05:30 IST