చంద్రబాబు హయాంలోనే మహిళల ఆర్థికాభ్యున్నతి

ABN , First Publish Date - 2023-02-07T00:15:30+05:30 IST

మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సూచించారు.

చంద్రబాబు హయాంలోనే మహిళల ఆర్థికాభ్యున్నతి
సమావేశంలో మాట్లాడుతున్న సీతారామలక్ష్మి

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి

భీమవరం అర్బన్‌, ఫిబ్రవరి 8: మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి సూచించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉండి, భీమవరం నియోజకవర్గాల మహిళా జాగృతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నా రు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు డా. శిరిగినీడి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అబద్ధపు నవ రత్నాలతో మహిళలను మోసం చేస్తోందన్నారు. మహిళా జాగృతి సభ్యురాలు ఎన్నారై కృష్ణప్రియ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ప్రాణ, మాన రక్షణ కరువైందని విమర్శించారు. మహిళ జాగృతి సభ్యురాలు బాపట్ల విజేత, అంగన్వాడీ డ్వాక్రా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, ఉండి నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్‌కళ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సయ్యద్‌ నసీమా బేగం, భీమవరం పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎండీ షబీనా, మాజీ కౌన్సిలర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:15:37+05:30 IST