ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: ఎమ్మెల్యే నిమ్మల

ABN , First Publish Date - 2023-02-06T23:41:27+05:30 IST

2019 ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తానని అరచేతిలో స్వర్గం చూపించి, ఎన్నికల అనంతరం అధికారం దక్కించుకుని సీఎం అయ్యాక జగన్‌ మోహన రెడ్డి మొండి చెయ్యి చూపిస్తూ, ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెడుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు.

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లులో ఇదేం ఖర్మ రాష్ర్టానికి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, ఫిబ్రవరి 6 : 2019 ఎన్నికల ముందు అందరికీ అన్ని ఇస్తానని అరచేతిలో స్వర్గం చూపించి, ఎన్నికల అనంతరం అధికారం దక్కించుకుని సీఎం అయ్యాక జగన్‌ మోహన రెడ్డి మొండి చెయ్యి చూపిస్తూ, ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు పెడుతున్నాడని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలోని ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా సోమవారం 16వ వార్డులో ఇంటింటికీ వెళ్ళి మహిళలు, ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గండేటి వెంకటేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల భవానీ, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, కొండ్రెడ్డి సూరిబాబు, మహ్మద్‌జానీ, బోణం మునసబు, నాగబాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:41:33+05:30 IST