ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయండి
ABN , First Publish Date - 2023-02-06T23:47:39+05:30 IST
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్లో డీఆర్వో మూర్తి సమీక్షించారు. పరీక్షలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
డీఆర్వో మూర్తి సమీక్ష
ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్ర వరి 6 : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్లో డీఆర్వో మూర్తి సమీక్షించారు. పరీక్షలను సమర్ధ్దవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించే ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు మొత్తం 31,293 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఐవో చంద్రశేఖర బాబు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. శానిటేషన్, తాగునీరు, ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరిం చారు. పరీక్షార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల రాకపోకల వేళలను రీషెడ్యూల్ చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పురుషులతో పాటు, మహిళా పోలీసులను కూడా నియమించాలన్నారు. సమావేశంలో డీఎం హెచ్వో డాక్టర్ నాగేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ బాపిరాజు, డీపీవో మల్లిఖార్జునరావు,డీఎస్పీ కృష్ణంరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వరప్రసాద్, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు.