బీజేపీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్‌ పార్టీ నిరసన

ABN , First Publish Date - 2023-02-07T00:01:07+05:30 IST

బడా బాబులు దేశాన్ని దోచుకు తింటున్నారని, అదానీ, అంబానీలను పోషిస్తూ దేశ సం పదను అమ్మేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌ నాయకు లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

బీజేపీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్‌ పార్టీ నిరసన
ఎస్‌బీఐ వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ఏలూరు కార్పొరేషన్‌, ఫిబ్రవరి 6: బడా బాబులు దేశాన్ని దోచుకు తింటున్నారని, అదానీ, అంబానీలను పోషిస్తూ దేశ సం పదను అమ్మేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్‌ నాయకు లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ దేశ సంపదను విక్రయించాలనే విధానాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరా రు. దండుబోయిన చంద్రశేఖర్‌, ప్రతాప సుబ్రహ్మణ్యశర్మ, కొమ్మన సాంబశివరావు, ఉప్పు మురళీకృష్ణ, సేవాదళ్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:01:09+05:30 IST