రక్త దాతలంతా ప్రాణ దాతలే

ABN , First Publish Date - 2023-02-01T23:57:05+05:30 IST

రక్తదాతలందరూ ప్రాణదాతలేనని ప్రజా రవా ణాశాఖ అధికారి ఎన్‌వీఆర్‌ వర ప్రసాద్‌ అన్నారు.

రక్త దాతలంతా ప్రాణ దాతలే
ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో రక్తదాన శిబిరం

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1 : రక్తదాతలందరూ ప్రాణదాతలేనని ప్రజా రవా ణాశాఖ అధికారి ఎన్‌వీఆర్‌ వర ప్రసాద్‌ అన్నారు. ఆర్‌ఎం కార్యాలయంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజా రవాణాశాఖ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసేం దుకు ముందుకు వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లను, కండక్టర్లను అంబికా సంస్థల అధినేత ఆంబికా రాజా అభినందించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు సుమారు 80 మంది రక్తదానం చేశారు. చెన్నా నాగభూషణం, టి వేణుగోపాల్‌, నరసింహం తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ నూజివీడు డిపోకు చెందిన ప్రసాద్‌ 58వ సారి శ్రీనివాస్‌ 20వ సారి రక్తదానం చేశారు.

Updated Date - 2023-02-01T23:57:06+05:30 IST