కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2023-01-24T23:59:08+05:30 IST

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
కైకలూరులో అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన

కైకలూరు, జనవరి 24 :కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌యాప్‌ను రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం కైకలూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద కైకలూరులోని అంగన్‌వాడీ కార్యకర్తలు సీఐటీయూ మండల కార్యదర్శి కె.లాజర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు ఒకటిని తక్షణమే రద్దు చేయాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెల్ఫేర్‌ ప్రమోషన్‌ వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని ప్రమోషన్ల ప్రక్రియ లో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. ఆందోళన అనంతరం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆందోళనలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పి.సుజాత, యూనియన్‌ అధ్యక్షురాలు జి.ఝాన్సీరాణి, కార్యదర్శి కె.రమాదేవి, షేక్‌ అబిదాభేగం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T23:59:09+05:30 IST