58 సార్లు రక్తదానం
ABN , First Publish Date - 2023-02-02T00:22:07+05:30 IST
తన వయస్సు (55)ను మించి 58 సార్లు రక్తదానం చేసిన నూజి వీడు ఆర్టీసీ (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్) ఉద్యోగి పలువురు మన్ననలు పొందుతు న్నారు.
నూజివీడు, ఫిబ్రవరి 1: తన వయస్సు (55)ను మించి 58 సార్లు రక్తదానం చేసిన నూజి వీడు ఆర్టీసీ (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్) ఉద్యోగి పలువురు మన్ననలు పొందుతు న్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడిగా నూజివీడు ఆర్టీసీ డిపోలో సూపర్వైజర్గా పనిచేస్తున్న పి.కృష్ణ ప్రసాద్ బుధవారం ఏలూరులో రోడ్డుభద్రత వారోత్సవాల సందర్భంగా నిర్వ హించిన రక్తదాన శిబిరంలో 58వ సారి రక్తదానం చేసి అందరి మన్ననలు పొందారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణప్రసాద్ను సత్కరించారు.