వివేకానందుడి బాటలో నడవాలి: జస్టిస్‌ నాగార్జునరెడ్డి

ABN , First Publish Date - 2023-01-26T04:32:08+05:30 IST

స్వామి వివేకానందుడి బాటలో నేటి తరం ముందుకు సాగాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ.నాగార్జునరెడ్డి సూచించారు.

వివేకానందుడి బాటలో నడవాలి: జస్టిస్‌ నాగార్జునరెడ్డి

అనపర్తి, జనవరి 25: స్వామి వివేకానందుడి బాటలో నేటి తరం ముందుకు సాగాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ.నాగార్జునరెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీరామకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో జీబీఆర్‌ విద్యాసంస్థల ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతుత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా జస్టిస్‌ నాగార్జునరెడ్డి, శాంతా బయోటెక్నిక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ కె.ఐ.వరప్రసాదరెడ్డి, కేన్సర్‌ శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖరరావు, ప్రముఖ ఆధ్యాత్మిక గాయని డాక్టర్‌ శోభారాజ్‌కు స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారాలు అందజేశారు. కాగా.. జస్టిస్‌ నాగార్జునరెడ్డి, వరప్రసాదరెడ్డి, చంద్రశేఖరరావు తమకు అందించిన రూ.25 వేల నగదుకు మరో మూడింతలు కలిపి సేవా కార్యక్రమాలకు వినియోగించాలంటూ రామకృష్ణసేవా సమితి ప్రతినిధులకు అందజేశారు.

Updated Date - 2023-01-26T04:32:08+05:30 IST