వాడో.. ఏడో తరగతి తప్పిన వెధవ
ABN , First Publish Date - 2023-02-02T02:54:01+05:30 IST
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది.
ఎమ్మెల్యే కొడాలి నానీపై వైసీపీ నేత యార్లగడ్డ వ్యాఖ్యలు
విజయవాడ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు తీవ్రస్థాయికి చేరింది. గుంటూరు జిల్లా వైకుంఠపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొ న్న వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఎమ్మెల్యేలు కొడాలి నానీ, వల్లభనేని వంశీలను ఉద్దేశించి చేసిన ఘా టు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. ‘ఆ కొడాలి నానీ ఏడో తరగతి తప్పిన వెధవ. ఆడు ఎంతసేపూ సినిమాలంటాడు. ఏ సినిమాలోనైనా ఏం ఉంటుంది. సినిమా మొత్తం హీరో కంటే విలన్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. చివరికిక్లయిమాక్స్లో హీరో చేతిలో చెంపదెబ్బ తినడం కామన్. వాడి వల్ల నియోజకవర్గానికి ఏం ఉపయోగం? అసలు వంశీ, నానీ ఏ వ్యాపా రం చేసి డబ్బులు సంపాదించారు?’ అని వ్యాఖ్యానించారు. మరో నేత దుట్టా మాట్లాడుతూ... వంశీ ఆగడాలను తాము ప్రశ్నించబట్టే తమకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు.