నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: పీవో

ABN , First Publish Date - 2023-02-01T23:34:41+05:30 IST

ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఐటీడీఏ పీవో నవ్య ఆదేశించారు.

నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: పీవో

సీతంపేట: ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఐటీడీఏ పీవో నవ్య ఆదేశించారు. బుధవారం సీతంపేటలోని ఐటీడీఏ ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షించారు. వేతనదారులకు రూ.257 వేతనం వచ్చేలా పని కల్పించాలని తెలిపారు. నిర్ధేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని, ఉపాధి హామీసిబ్బంది ప్రతిరోజూ క్షే త్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, ఉపాధి హామీ ఏపీడీ శ్రీహరిరావు, ఏపీవోలు, టీసీలు, టీఏలు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:34:42+05:30 IST