పురుగు మందు తాగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-02-01T23:36:35+05:30 IST
మనస్తాపంతో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు.
రాజాం రూరల్: మనస్తాపంతో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ వై.రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దోసరి రామినాయుడువలస గ్రామానికి చెందిన కొర్రాయి అప్పన్న (37)కు అదే గ్రామానికి చెందిన రామలక్ష్మితో 15ఏళ్ల కిందట వివాహమయ్యింది. అప్పటి నుంచి అత్తవారింట్లో ఇల్లరికంగా ఉంటున్నాడు. పిల్లలు కలగలేదన్న మాససిక ఆందోళనతో మద్యానికి బానిసయ్యాడు. ఈనేపథ్యంలో ఇటీవల భార్యా భర్తల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీంతో మంగళవారం అప్పన్న మనస్తాపంతో పురుగు మందు తాగాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందు తూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య వరలక్ష్మి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.