గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలి
ABN , First Publish Date - 2023-02-06T23:21:57+05:30 IST
గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ నేతలు బుగత అశోక్, అలమండ ఆనందరావు డిమాండ్ చేశారు. గృహనిర్మాణ సాయం పెంపు, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించాయి. సీపీఎం, టీడీపీ, ఆప్, లోక్సత్తా పార్టీలు సంఘీభావం తెలిపాయి.
గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలి
విజయనగరం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ నేతలు బుగత అశోక్, అలమండ ఆనందరావు డిమాండ్ చేశారు. గృహనిర్మాణ సాయం పెంపు, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించాయి. సీపీఎం, టీడీపీ, ఆప్, లోక్సత్తా పార్టీలు సంఘీభావం తెలిపాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు. సీపీఐ నాయకులు రంగరాజు, అప్పన్న, బుగత పావని, నాగభూషన్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.