లోకేష్‌ పాదయాత్రకు ఆంక్షలు సరికాదు

ABN , First Publish Date - 2023-02-06T23:27:49+05:30 IST

నారా లోకేష్‌ నిర్వహిస్తున్న పాదయాత్రకు పోలీసులు ద్వారా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంచడం సరికాదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయాలని చూడడం దారుణమన్నారు.

 లోకేష్‌ పాదయాత్రకు ఆంక్షలు సరికాదు

లోకేష్‌ పాదయాత్రకు ఆంక్షలు సరికాదు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు

రాజాం: నారా లోకేష్‌ నిర్వహిస్తున్న పాదయాత్రకు పోలీసులు ద్వారా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంచడం సరికాదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాయాలని చూడడం దారుణమన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. లోకేష్‌ పాదయాత్రకు వస్తున్న జనాదరణ చూసి తట్టుకోలేకే వైసీపీ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నారు. అడుగడుగునా పోలీసు కేసులు నమోదుచేయడం దారుణమన్నారు. ఇది విపక్షాల గొంతునొక్కడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనైతిక విధానాలను విడనాడాలని హితవుపలికారు.

Updated Date - 2023-02-06T23:27:51+05:30 IST