సైకో పాలనను పారదోలాలి

ABN , First Publish Date - 2023-02-01T23:42:45+05:30 IST

రానున్న ఎన్నికల్లో సైకో పాలనను పారదోలాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి పిలుపునిచ్చారు.

  సైకో పాలనను పారదోలాలి
చీపురువలసలో మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు రూరల్‌: రానున్న ఎన్నికల్లో సైకో పాలనను పారదోలాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి పిలుపునిచ్చారు. బుధవారం చీపురువలస, పందిరిమామిడివలసలో టీడీపీ సాలూరు మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశు ఆధ్వర్యంలో ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ సీఎం జగన్‌రెడ్డి పాలనలో రైతుల ఇంట కన్నీరు కారుతోందన్నారు. ధాన్యం అమ్ముకొలేని పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యా యులపై ప్రభుత్వం కక్షకట్టిందని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు, వివిద పన్నులు పెంచి ప్రజలను సీఎం జగన్‌రెడ్డి పీడిస్తు న్నారన్నారు. గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ర్యాలీలు చేశాయి. ఈ సందర్భగా సంధ్యా రాణికి పలువురు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ఖరాసవలస ఎంపీటీసీ అప్పికొండ రమాదేవి, అక్యాన తిరుపతిరావు, ఆముజూరు శ్రీనివాసరావు, మాలతీదొర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:42:53+05:30 IST