రైతులకు రుణాలు అందించండి

ABN , First Publish Date - 2023-01-26T00:34:59+05:30 IST

జిల్లాలో రైతులకు బ్యాంకు అధికారులు త్వరితగతిన రుణాలు అందించి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సూచించారు.

  రైతులకు రుణాలు అందించండి
మాట్లాడుతున్న జేసీ ఆనంద్‌

పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు బ్యాంకు అధికారులు త్వరితగతిన రుణాలు అందించి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ(డీఎల్‌టీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరి, ఇతర పంటల రుణ పరిమితి తదితర అంశాలపై సమీక్షించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల పంటల దిగుబడి, చిన్నతరహా పరిశ్రమల ఆదాయం అంచనా ఆధారంగా రుణ పరిమితి నిర్ధారించినట్లు జేసీ తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎం నాగార్జున, ఎల్డీఎం మూర్తి, జిల్లా పశుసంవర్థక, మత్స్య శాఖాధికారులు ఈశ్వరరావు, వి.తిరుపతయ్య, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:35:00+05:30 IST