మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-02-01T23:51:33+05:30 IST

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర బా లల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

దాసన్నపేట: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర బా లల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు. బుధవారం తోటపాలెంలోని నాలుగెస్సల కళాశాలలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, ఎక్సైజ్‌, విద్యాశాఖ, పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖ,అధికారులు, ప్రజా ప్రతి నిధులు భాగస్వాములై మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇందుకోసం జాయింట్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ హిమబిందు, సుధారాణి, సత్యనారాయణ, భవానీ, సంధ్య, నాగరాజు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:51:34+05:30 IST