హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలి
ABN , First Publish Date - 2023-02-06T23:47:57+05:30 IST
ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని టీడీపీ నాయకుడు, రిటైర్డు ఏటీడబ్లూవో నదివాడ కృష్ణబాబు అన్నారు.
కురుపాం: ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని టీడీపీ నాయకుడు, రిటైర్డు ఏటీడబ్లూవో నదివాడ కృష్ణబాబు అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. 2018 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన మెస్ చార్జీలు 3,4వ తరగతులకు రూ.1000, 5 నుంచి 10వ తరగతి వరకు రూ.1250, ఇంటర్ విద్యార్థులకు రూ.1400 నిర్ధారించగా, వాటినే నేటికీ కొనసాగించడం దారుణమన్నారు. కరోనా, వైసీపీ ప్రభుత్వం పుణ్యాన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెట్టగలరని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.