కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి

ABN , First Publish Date - 2023-02-06T23:30:09+05:30 IST

‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి

కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయండి

బొబ్బిలి: ‘దశాబ్దాలుగా స్థానికంగా నివాసముంటున్నాం. రోజువారి కూలీ పనులు చేసుకొని బతుకుతున్నాం. కానీ మాకు కుల ధ్రువీకరణపత్రాలు మం జూరు చేయడం లేదు’ అంటూ యానాది తెగకు చెందిన 35 కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆర్డీవో శేషశైలజను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఐదు దశాబ్దాలుగా రాణిమల్లమ్మదేవి చెరువు గట్టుపై నివాస ముండేవారమని.. 15 సంవత్సరాల కిందట ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు కేటాయించా రని చెప్పారు. అయితే మక్కువ, సీతానగరం మండలాలో యానాది కులస్థులకు కుల ధ్రువీకరణపత్రాలు ఇచ్చి.. ఇక్కడ మాత్రం మొండిచేయి చూపుతున్నారని పిట్ల శ్రీరాములు, రూప, ఇందిర, శాంతి, పిరిడి రాజేశ్‌, మ ర్రి రమణమ్మ, భాస్కరరావు, మామిడి రాము, గొలుసు నరసమ్మ ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులకు నివేదించి సమస్య పరిష్కరిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు.

ఆర్డీవోకు విన్నవిస్తున్న యానాది కులస్థులు

Updated Date - 2023-02-06T23:30:11+05:30 IST