ఇళ్ల నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-02-06T23:37:54+05:30 IST
ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలకు రూ.ఐదు లక్షలు ఇవ్వలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
- సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు
పాలకొండ రూరల్: ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలకు రూ.ఐదు లక్షలు ఇవ్వలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లస్థలాల్లో రూ.లక్షా 80 వేలతో నిర్మాణాలు పూర్తికావని తెలిపారు. ఇళ్లు నిర్మించకపోతే రద్దు చేస్తామని ఆదేశాలు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. కార్య క్రమంలో సీపీఐ నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు, కొప్పర త్రినాధ, మోహన్ పాల్గొన్నారు.