దౌడ్‌..దౌడ్‌!

ABN , First Publish Date - 2023-02-06T23:13:06+05:30 IST

ఉరుకులు, పరుగులు కేరింతల నడుమ ఎడ్ల పరుగు పందేలు ఉత్సాహంగా సాగాయి. ఇందుకు లక్కవరపుకోట మండలం కల్లేపల్లి వేదికగా నిలిచింది. సదానందేశ్వర విజయకేశవ స్వామివార్ల తీర్థ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 15 ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. వందలాదిగా తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు.

దౌడ్‌..దౌడ్‌!

దౌడ్‌..దౌడ్‌!

ఉత్సాహంగా ఎడ్ల పరుగు పందేలు

లక్కవరపుకోట: ఉరుకులు, పరుగులు కేరింతల నడుమ ఎడ్ల పరుగు పందేలు ఉత్సాహంగా సాగాయి. ఇందుకు లక్కవరపుకోట మండలం కల్లేపల్లి వేదికగా నిలిచింది. సదానందేశ్వర విజయకేశవ స్వామివార్ల తీర్థ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 15 ఎడ్ల బళ్లు పాల్గొన్నాయి. వందలాదిగా తరలివచ్చిన జనం ఆసక్తిగా తిలకించారు. ఎడ్లు ‘దౌడ్‌’ తీస్తూ ముందుకు సాగాయి. వల్లంపూడి-1 బండి ప్రథమస్థానం దక్కించుకుంది. దేవరాపల్లి, కలగాడ, వల్లంపూడి-2,వావిలపాడు, బళ్లంక ఎడ్ల బళ్లు తరువాత స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నగదుతో పాటు బహుమతులు అందించారు. ప్రోత్సాహకం కింద ఒక్కో బండికి రూ.1000 చొప్పున నిర్వాహక కమిటీ ప్రతినిధులు అందించారు.

Updated Date - 2023-02-06T23:13:07+05:30 IST