నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2023-02-01T23:48:38+05:30 IST

నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఏపీ ఆహార కమి షన్‌ సభ్యుడు బి.కాంతారావు తెలిపారు. బుఽ దవారం పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రా లు, చౌక ధరలు దుకాణాలు, దాసన్నపేట లోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి, కస్పా స్కూల్‌ను సందర్శించారు.

నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే చర్యలు

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ఏపీ ఆహార కమి షన్‌ సభ్యుడు బి.కాంతారావు తెలిపారు. బుఽ దవారం పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రా లు, చౌక ధరలు దుకాణాలు, దాసన్నపేట లోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి, కస్పా స్కూల్‌ను సందర్శించారు. నాగోజిపేట అంగ న్‌వాడీ కేంద్రంలో ఐదుగురు పిల్లలు నమో దై ఉండగా గత ఐదు రోజుల్లో హాజరు పట్టిక లో ఖాళీగా ఉండడాన్ని పరిశీలించారు. ఎందుకు హాజరు వేయలేదని ప్రశ్నించారు. పిల్లలు హాజరు కాలేదని కార్యకర్త చెప్ప గా ఆబ్సెంట్‌ వెయ్యాలి కదా? ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. అనంతరం కస్పా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 50 శాతం కంటే తక్కువగా ఉందని, వారి హాజరు శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అక్కడ నుంచి స్టోర్‌ రూంలో స్టాక్‌ రిజి స్టర్‌ను పరిశీలించారు. 200 కేజీల బియ్యం తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట ఐసీడీఎస్‌ పీడీ శాంతి కుమారి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-01T23:48:40+05:30 IST