కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి

ABN , First Publish Date - 2023-02-01T23:51:16+05:30 IST

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ డిమాండ్‌ చేశారు. కరెన్సీ నోట్లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని ప్రజాపోరు యాత్రను డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో బుధవారం ఆయన ప్రారంబించారు.

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌

సీతంపేట, ఫిబ్రవరి 1: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జేరిపోతుల పరశురామ్‌ డిమాండ్‌ చేశారు. కరెన్సీ నోట్లపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలని ప్రజాపోరు యాత్రను డాక్టర్‌ అంబేడ్కర్‌ భవన్‌లో బుధవారం ఆయన ప్రారంబించారు. ముందుగా అంబేడ్కర్‌, రామాభాయి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాపోరు యాత్రలో విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అఽధికారి మిట్ట రామారావు, దళిత ద్రావిడ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్ల జీవన్‌కుమార్‌, సీఏపీఎస్‌ఎస్‌ జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణలు పాల్గొని ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురామ్‌ మాట్లాడుతూ తమ డిమాండ్‌ సాధనకు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించడం వల్ల ఇప్పటికి 8 మంది ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడటం జరిగిందన్నారు. మిగతా ఎంపీలు మాట్లాడి పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలనే లక్ష్యంతో ఇప్పుడు ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ యాత్రకు ప్రతి ఒక్కరు సంపూర్ణ మద్దతు ఇచ్చి లక్ష్యసాధనలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి జాతీయ సలహాదారులు ఆళ్ళ రామకృష్ణ, ఉదయ భాస్కర్‌, పిడుగు ఆశీర్వాదం, మిద్దెపాక రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:51:20+05:30 IST