వివేకా కేసు నుంచి దృష్టి మరల్చడానికే విశాఖ: అచ్చెన్న
ABN , First Publish Date - 2023-02-02T02:54:51+05:30 IST
‘వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి విశాఖ రాజధాని అంశాన్ని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టెక్కలి, ఫిబ్రవరి 1: ‘‘వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి విశాఖ రాజధాని అంశాన్ని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో మాట్లాడారు. ‘‘వివేకా హత్యకేసుకు తాడేపల్లి ప్యాలె్సకు లింకులున్నాయి. సీఎం జగన్ ఇంట్లో ఉన్న నవీన్ కు సీబీఐ నోటీసులు జారీచేయడంతో ప్యాలెస్ ఉలికిపాటుకు గురైంది. బాబాయిని ఎవరు చం పారో సీఎం జగన్కు తెలుసు. కానీ ఆయన రోజు కో మాట మాట్లాడుతున్నారు’’ అన్నారు.