గాయపడిన వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2023-02-06T23:58:32+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్పురం ఎస్ఐ రాజేష్ తెలిపారు.
రణస్థలం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కృష్ణాపురం గ్రా మానికి చెందిన గొర్ల ఆదినారాయణ (50) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందాడు. ఈనెల 4న ఎర్రన్నాయుడు విగ్రహం వద్ద జాతీయ రహదారిని దాటుతున్న ఆదినారాయణను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదినారాయణకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జేఆర్పురం ఎస్ఐ రాజేష్ తెలిపారు.