భవన నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2023-01-24T23:46:19+05:30 IST
: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీ శ్వరరావు అన్నారు. క్యాం పస్లో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.

ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీ శ్వరరావు అన్నారు. క్యాం పస్లో మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.66.7 కోట్లతో నిర్మిస్తున్న అకడమిక్ బ్లాక్ను ఈ ఏడాది అక్టోబరుకు సిద్ధం చేస్తున్నా మన్నారు. రూ.2.82 కోట్లతో ప్రస్తుతం ఉన్న భవనాలపై భోజనాల కోసం అదనపు గదులు, రూ.3.5 కోట్లతో ఇంజనీ రింగ్ ల్యాబ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పనులు ఏప్రిల్ నాటికి పూర్తిచేస్తామన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఎల్డీ సుధాకర్బాబు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ వెంకటరెడ్డి, ఏఈ కోదండరావు, ట్రిపుల్ ఐటీ ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.