ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు

ABN , First Publish Date - 2023-02-06T23:42:42+05:30 IST

మూడు రాజధానులు ఖాయం. త్వరలో విశాఖపట్నంలో రాజధానిని ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారుస్తారు.’ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం సరికాదని, ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తా రని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు.

 ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారు

అరసవల్లి: ‘మూడు రాజధానులు ఖాయం. త్వరలో విశాఖపట్నంలో రాజధానిని ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి విశాఖకు మకాం మారుస్తారు.’ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేయడం సరికాదని, ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తా రని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిందన్నారు. ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కూడా వాదనలు జరుగుతున్నాయని చెప్పారు. మరి ఎలా మూడు రాజధానులు ఖాయమని అంటారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఏ నిర్ణయం అయినా రాజ్యాంగాన్ని అనుసరించి, న్యాయస్థానాల తీర్పులకు లోబడి ఉంటుం దన్నారు. మరి ఏప్రాతిపదికన మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారో వైసీపీ నాయకులు ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.

Updated Date - 2023-02-06T23:42:44+05:30 IST