నీలగిరి తోట దగ్ధం
ABN , First Publish Date - 2023-02-02T00:01:55+05:30 IST
సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలోని పది కుటుంబాలకు చెందిన ఎనిమిది ఎకరాల నీలగిరి తోట మంగళవారం రాత్రి దగ్ధమైంది.
ఎచ్చెర్ల: సంతసీతారాంపురం పంచాయతీ చిన్నరావుపల్లి గ్రామంలోని పది కుటుంబాలకు చెందిన ఎనిమిది ఎకరాల నీలగిరి తోట మంగళవారం రాత్రి దగ్ధమైంది. లక్షలాది రూపాలయాల విలువైన తోట దగ్ధం కావడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పొన్నాడ ఆదినారాయణ, రామారావు, శ్రీనివాసరావు, బాలకృష్ణ, జగన్నాథమ్మ, భీమారావు, రమణమ్మ, చిగులపల్లి రాధమ్మ, పప్పల రమణమ్మలకు చెందిన నీలగిరి తోటలు కాలిబూడియ్యాయి. ప్రభుత్వం పరిహారం అందించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.