‘పది’ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి

ABN , First Publish Date - 2023-02-01T23:57:16+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థి నులు మంచి ఫలితాలు సాధించాలని సమగ్రశిక్షా అభియాన్‌ సీఎంవో ఎస్‌.హరికృష్ణ అన్నారు. బుధవారం గంగివలస కేజీ బీవీ పాఠశాలను సందర్శించారు.

 ‘పది’ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి
పోలాకి: వంటలను పరిశీలిస్తున్న సీఎంవో హరికృష్ణ

గంగివలస (పోలాకి): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థి నులు మంచి ఫలితాలు సాధించాలని సమగ్రశిక్షా అభియాన్‌ సీఎంవో ఎస్‌.హరికృష్ణ అన్నారు. బుధవారం గంగివలస కేజీ బీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ పరీక్షలకు విద్యార్థినులు సన్నద్ధం కావాలని కోరారు. వెనుకబడిన విద్యార్థినులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వా లని ఉపా ధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజ రును పరిశీలించారు. వంట నిర్వహణ, మెనూ పరిశీలించి పలు సూచనలు చేశారు. సంక్షేమాధికారి బి.శారద బోధన, బోధనేతర సిబ్బంది పాఠశాలలో ఎదు ర్కొంటున్న సమస్య లను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

మధ్యాహ్నం భోజనం నిర్వహణపై అసంతృప్తి

హిరమండలం: కొండరాగోలు కాలనీ ప్రాథమిక పాఠశా లలో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణపై ఎంఈవో కె.రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం పాఠశా లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటకాలలో నాణ్య త లేకపోవడంతో నిర్వాహకులను హెచ్చరించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:57:17+05:30 IST