ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-02-06T23:55:45+05:30 IST
ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు.
శ్రీకాకుళం అర్బన్: ఆశావర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ హెచ్చరించారు. సోమవారం నగరంలోని యూటీఎఫ్ కార్యా లయంలో నిర్వహించిన మహాసభలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరి స్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న నిర్వ హించే ఛలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపుని చ్చారు. ఆశావర్కర్లపై పని భారం తగ్గించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీను ఏక గ్రీవంగా ఎన్నుకు న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎస్వీ రమణ, బి.హరీష్, నాయకులు పాల్గొన్నారు.