కుక్కల దాడిలో 25 మేక పిల్లలు మృతి
ABN , First Publish Date - 2023-02-01T23:59:22+05:30 IST
చాపర గ్రామంలో కుక్కల దాడిలో 25 మేకు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కిక్కర సెంబోలు, రంధి బలుసు, కె.ఫల్గుణకు సంబంధించిన 25 మేక పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపినట్లు బాధితులు తెలిపారు.
మెళియాపుట్టి: చాపర గ్రామంలో కుక్కల దాడిలో 25 మేకు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కిక్కర సెంబోలు, రంధి బలుసు, కె.ఫల్గుణకు సంబంధించిన 25 మేక పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపినట్లు బాధితులు తెలిపారు. పొలాల్లో ఎవరూ లేని సమయంలో మేక పిల్లలపై దాడి చేసినట్లు పేర్కొంటున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.