ఉద్యోగాల పేరిట రూ.14 లక్షల టోకరా
ABN , First Publish Date - 2023-02-07T00:00:48+05:30 IST
: రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలకు టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక శివానీ నగర్కు చెందిన శ్రీని వాస బారికొ టాక్సీ డ్రైవర్గా ఉన్నాడు. ఈయనకు ఎంబీఏ చదివిన కుమార్తె ప్రవల్లిక, బీహెచ్ఎంఎస్ చదివిన కుమారుడు అమరేశ్వర్ బారికొ ఉన్నారు. వీరిరువురూ నిరుద్యో గులుగా ఉండడంతో రైల్వేలో ఉద్యాగా లిప్పిస్తామని యశోదానగర్లో నివాసముంటున్న తండ్రి కొడుకు లైన కొల్ల రాము, కొల్ల చిరంజీవులు నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన బాధితులు రూ.14 లక్షలు నగదును 2021 జనవరి 20వ తేదీన ఇచ్చారు. కొల్ల రాము ఉన్నత చదువులు చదివి రైల్వేలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. చిరంజీవులు రైల్వే గేట్మేన్గా పని చేస్తున్నాడు. కాగా కాలం గడుస్తు న్నప్పటికీ ఉద్యోగాలమాట ఎత్తకపోవడంతో తాము మోసమోయామని భావించిన బాధితులు తామిచ్చిన నగదు ఇచ్చేయా లని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే నగదు చెల్లించేందుకు కొల్ల రాము, చిరంజీవులు నిరాకరించి చేతులెత్తేయడంతో బాధితుడు శ్రీనివాస బారికొ పోలీసు లను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు.
పాతపట్నం, ఫిబ్రవరి 6: రైల్వే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలకు టోకరా వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్థానిక శివానీ నగర్కు చెందిన శ్రీని వాస బారికొ టాక్సీ డ్రైవర్గా ఉన్నాడు. ఈయనకు ఎంబీఏ చదివిన కుమార్తె ప్రవల్లిక, బీహెచ్ఎంఎస్ చదివిన కుమారుడు అమరేశ్వర్ బారికొ ఉన్నారు. వీరిరువురూ నిరుద్యో గులుగా ఉండడంతో రైల్వేలో ఉద్యాగా లిప్పిస్తామని యశోదానగర్లో నివాసముంటున్న తండ్రి కొడుకు లైన కొల్ల రాము, కొల్ల చిరంజీవులు నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన బాధితులు రూ.14 లక్షలు నగదును 2021 జనవరి 20వ తేదీన ఇచ్చారు. కొల్ల రాము ఉన్నత చదువులు చదివి రైల్వేలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. చిరంజీవులు రైల్వే గేట్మేన్గా పని చేస్తున్నాడు. కాగా కాలం గడుస్తు న్నప్పటికీ ఉద్యోగాలమాట ఎత్తకపోవడంతో తాము మోసమోయామని భావించిన బాధితులు తామిచ్చిన నగదు ఇచ్చేయా లని వారిపై ఒత్తిడి తీసుకువచ్చారు. అయితే నగదు చెల్లించేందుకు కొల్ల రాము, చిరంజీవులు నిరాకరించి చేతులెత్తేయడంతో బాధితుడు శ్రీనివాస బారికొ పోలీసు లను ఆశ్రయించాడు. ఈ మేరకు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపారు.