నియోజకవర్గంలో అభివృద్ధి ఏది..?
ABN , First Publish Date - 2023-02-07T00:21:08+05:30 IST
మూడేళ్లగా ఎర్ర గొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడంలేదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడూరి ఎరిక్షన్బాబు ప్రశ్నించారు.
ఎర్రగొండపాలెం(పుల్లలచెరువు), ఫిబ్రవరి 6: మూడేళ్లగా ఎర్ర గొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగడంలేదని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడూరి ఎరిక్షన్బాబు ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని కొలుకుల రోడ్డు, ఎన్జీవో కాలనీ, ఇజ్రాయిల్పేట, బంగ్లారోడ్డులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. ముందుగా సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ హాయంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. మున్సిపాల్శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి పదవిని కాపాడుకోవాడానికి తప్ప అభివృద్ధి పనులు చేయించడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. మార్కాపురం జిల్లా చేస్తామని ఆర్భాటంగా చెప్పిన అధికార పార్టీ నేతలు ప్రస్తుతం నోరు మెదపడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మార్కాపురం జిల్లాను చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు చేకూరి సుబ్బయ్య, పయ్యావుల ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, శనగా నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, చిట్యాల వెంగళరెడ్డి, సత్యనారయణగౌడ్, తోట మహేష్ నాయుడు, పట్టణ అధ్యక్షుడు మస్తాన్వలి, పాలడుగు వెంకటకోటయ్య, కె జిన్నా,షేక్ ఇస్మాయిల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.