టీడీపీ సీనియర్ నేత వెంకటస్వామి మృతి
ABN , First Publish Date - 2023-02-06T23:11:42+05:30 IST
పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు చలువాది వెంకటస్వామి (68) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చీమకుర్తిలో అంత్య క్రియలు నిర్వహించారు.
నివాళులర్పించిన విజయ్కుమార్
చీమకుర్తి, ఫిబ్రవరి 6 : పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు చలువాది వెంకటస్వామి (68) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం చీమకుర్తిలో అంత్య క్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ వెంకటస్వామి భౌతికకాయాన్ని సంద ర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటస్వామి మృతి పార్టీకి లోటన్నారు. వెంకట స్వామి గతంలో చీమకుర్తి మేజర్ పంచాయతీకి ఉప సర్పంచ్గా పట్టణ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ నగర పంచాయతీ కౌన్సిలర్గా పనిచేశారు. టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, కందిమళ్ల గంగాధరరావు, సూ రంపల్లి హనుమంతరావు, కౌత్రపు రాఘవరావు, కాట్రగడ్డ రమణ య్య, రావిపాటి రాంబాబు, మాజేటి హనుమాన్, ఎస్ ఆంజ నేయులు, బుజ్జిబాబు, గొల్లపూడి కోటేశ్వరరావు వెంకటస్వామికి భౌతికకాయానికి నివాళులర్పించారు.