అస్వస్థతకు గురైన కేజీబీవీ విద్యార్థిని మృతి

ABN , First Publish Date - 2023-02-06T23:14:31+05:30 IST

దొనకొండ కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) విద్యార్థినీ విప్పర్ల సుప్రియ(15) కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది.

అస్వస్థతకు గురైన కేజీబీవీ విద్యార్థిని మృతి

దొనకొండ, ఫిబ్రవరి 6 : స్థానిక కస్తూరీభా గాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) విద్యార్థినీ విప్పర్ల సుప్రియ(15) కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్లో వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందింది. అందిన వివరాల మేరకు... మండలంలోని లక్ష్మీపురానికి చెందిన విప్పర్ల చిన్నలక్ష్మయ్య రెండో కుమార్తె సుప్రియ దొనకొండ కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గత నెల పాఠశాలలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురవ్వటంతో అదే నెల 27న పాఠశాల సిబ్బంది సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఒంగోలు వైద్యశాలలో చేర్పించారు. ఆ తర్వాత అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మంగళగిరి వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు.

Updated Date - 2023-02-06T23:14:33+05:30 IST