సంచార పశువైద్యశాల ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-07T00:10:35+05:30 IST

సంచార పశువైద్యశాల వాహనాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రారంభించారు.

సంచార పశువైద్యశాల ప్రారంభం

పొదిలి రూరల్‌, ఫిబ్రవరి 6 : సంచార పశువైద్యశాల వాహనాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పశువులు, మూగజీవాలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. మండల కేంద్రంలో వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. పశుపోషకులు 1962 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌చేస్తే 30 నిమిషాల్లో రైతు ఇంటికి వస్తుందన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డీడీ వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఏడీ వేణు, కొనకనమిట్ల, పొదిలి, పెదారికట్ల, గొట్లగట్టు వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:10:37+05:30 IST