భారాలు మోపారు.. అభివృద్ధిని విస్మరించారు..
ABN , First Publish Date - 2023-02-07T00:14:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రకరకాల భారాలు మోపి అభివృద్ధిని విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి విమర్శించారు.
గిద్దలూరు, ఫిబ్రవరి 6 : వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రకరకాల భారాలు మోపి అభివృద్ధిని విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముత్తుముల అశోక్రెడ్డి విమర్శించారు. ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 11వ వార్డులో సోమవారం రాత్రి ఆయన పర్యటించారు. తొలత కళాశాల రోడ్డులోని శ్రీ వినాయకస్వామి దేవాలయంలో పూజలు అనంతరం ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అశోక్రెడ్డి మాట్లాడారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి నాటి నుండి నేటి వరకు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. గిద్దలూరులో టీడీపీ హయాంలో 1400 మంది పేద కుటుంబాలకు టిడ్కో గృహాలను మంజూరు చేసి 90శాతం పనులు పూర్తి కాగా ఈ నాలుగేళ్ళలో ఆ పనులు పూర్తి చేయలేదన్నారు. టీడీపీ హయాంలో గుండ్లమోటు తాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాన్షావలి, నాయకులు మోడిగిరి కృష్ణ సాగరబోయిన రమేష్, నల్లగట్ల బ్రహ్మం, పందిటి రజనీబాబు, గోపాల్రెడ్డి, బిల్లా రమేష్, పాలుగుళ్ళ చిన్నశ్రీనివాసరెడ్డి, పెద్దభాషా, బాలచెన్నయ్య, మండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.