బాలికపై యువకుడు అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2023-02-02T00:58:57+05:30 IST

స్కూలులో ఉన్న బాలికను ఓ యువకుడు పొలా ల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.

 బాలికపై యువకుడు అత్యాచారయత్నం

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

సంతనూతలపాడు, ఫిబ్రవరి 1: స్కూలులో ఉన్న బాలికను ఓ యువకుడు పొలా ల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. ఎస్సై బి.శ్రీకాంత్‌ తెలిపిన సమాచారం మేరకు... సంతనూతలపాడులోని ఓ ప్రైవే ట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బాలిక(11 సంవత్సరాలు)ను గ్రామానికి చెందిన దుంపా ప్రసన్నకుమార్‌రెడ్డి(20) మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో స్కూలు వద్ద కలిశాడు. మీ అమ్మమ్మ నిన్ను తీసుకురమ్మందని చెప్పి ఆ పాఠశాల నుంచి బాలికను కామేపల్లివారిపాలెం రోడ్డు వైపు ఉండే పొలాల్లోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమె నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేయబోతుండటం తో చుట్టు పక్కల పొలాల్లోని వాళ్లు గమనించి పెద్దగా కేకలు వేశారు. దీంతో అతడు వెంటనే ఆ బాలికను అదే పాఠశాల వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె జరిగిన విషయం చెప్పింది. దీంతో బా ధి తురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రసన్నకుమార్‌రెడ్డిపై బుధవారం రాత్రి ఎస్సై బి.శ్రీకాంత్‌ పోక్సోయాక్టు కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-02-02T00:58:59+05:30 IST