ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2023-02-06T21:23:16+05:30 IST
ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మా
విడవలూరు, ఫిబ్రవరి 6: ఈ క్రాప్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. మండల పరిధిలోని పార్లపల్లి, విడవలూరు, ఊటుకూరు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ క్రాప్ నమోదుపై రైతులతో, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ క్రాప్ నమోదు చేసుకుంటే ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలు అందుతాయన్నారు. మండలంలో 80శాతం నమోదు చేసి ఉన్నారని, మిగిలిన 20 శాతాన్ని వెంటనే నమోదు చేయాలన్నారు. అయన వెంట జిల్లావ్యవసాయాధికారి సుధాకర్, ఏడీఏ సుజాత, తహసీల్దారు చంద్రశేఖర్, ఎంపీడీవో సుబ్రహ్మణ్మం, ఏవో వెంకట కిష్ణయ్య తదితరులు ఉన్నారు.