విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించం

ABN , First Publish Date - 2023-01-25T00:29:37+05:30 IST

కమ్యూనిస్టుల సమరశీల పోరాటాలతో సాధిం చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తే సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలు అన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే సహించం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య

పత్తికొండటౌన్‌, జనవరి 24: కమ్యూనిస్టుల సమరశీల పోరాటాలతో సాధిం చుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తే సహించబోమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలు అన్నారు. ఈ నెల 27న విశాఖలో కార్మికుల మహాగర్జనకు సంఘీభావంగా మంగళ వారం స్థానిక నాలుగు స్తంభాల కూడలిలో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను రామచంద్రయ్య ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించా ల్సింది పోయి ప్రైవేట్‌ పరం చేసేందుకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం ఆపేందుకు సాగించే సమరశీల పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్‌, ఏఐటీయూసీ నాయకులు కృష్ణ, నెట్టికంటయ్య, రంగన్న, ప్రజాసంఘాల నాయకులు సురేంద్రకుమార్‌, గురుదాసు, నర్సారావు, ఈరన్న, రాజప్ప, ఉచ్చన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:29:41+05:30 IST