యువగళాన్ని ఆపే దమ్ము లేదు

ABN , First Publish Date - 2023-02-06T23:30:33+05:30 IST

నారా లోకేష్‌ చేస్తున్న యువగళం పాద యాత్రను ఆపే దమ్ము ఎవ్వరికీ లేదని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

   యువగళాన్ని ఆపే దమ్ము లేదు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

గోనెగండ్ల, ఫిబ్రవరి 6: నారా లోకేష్‌ చేస్తున్న యువగళం పాద యాత్రను ఆపే దమ్ము ఎవ్వరికీ లేదని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాఽధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి రాషా్ట్రన్ని ఆథోగతి పాలు చేశారని ఆయన అన్నారు. మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత చార్జీలు, రెండుసార్లు బస్సు చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపాడని ఆయన విమర్శించారు. వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను గడప గడప కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తూ చీదరించుకుంటున్నారని అన్నారు. జగన తన పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, రైతులపై కపట ప్రేమ వలబోస్తూ ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం చంద్రబాబు పాలన కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్టారెడ్డి, జిల్లా టీడీపీ కార్యదర్శి ప్రభాకర్‌నాయుడు, సింగిల్‌ విండో మాజీ ప్రెసిడెంట్‌ పరమేశ్వరరెడ్డి, యూనూష్‌, దరగల మాబు, కౌలుట్లయ్యనాయుడు, చెన్నలరాయుడు, జైపాల్‌ పాల్గొన్నారు.

టీడీపీ నాయకులను పరామర్శించిన కోట్ల: గోనెగండ్ల మండల టీడీపీ నాయకలు పిల్లిగుండ్ల ఉల్లిగడ్డల రాముడు, నెరుడుప్పల రామాంజినేయులు ఆనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించారు.

Updated Date - 2023-02-06T23:30:34+05:30 IST