మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

ABN , First Publish Date - 2023-02-02T00:31:29+05:30 IST

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు.

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు   ముఖ్యమంత్రికి ఆహ్వానం
ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

శ్రీశైలం, ఫిబ్రవరి 1: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్‌.లవన్న, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, అధ్యాపక, అర్చకస్వాములు కలిసి సీఎంను ఆహ్వానించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం పలికి, స్వామి, శేషవస్త్రాలు, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, దేవస్థానం క్యాలెండర్లు, డైరీని అందజేశారు.

Updated Date - 2023-02-02T00:31:30+05:30 IST