రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2023-02-02T00:27:37+05:30 IST
పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
డోన్(రూరల్), ఫిబ్రవరి 1: పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. డోన్ పట్టణం కొత్తపేటకు చెందిన జయకృష్ణ (16) క్రిష్ణగిరి మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పట్టణంలోని వెంకటనాయునిపల్లె వెళ్లే రహదారి సమీపంలో నివాసముంటున్న మధు అనే వ్యక్తి మోటారు బైక్పై జయకృష్ణ మోడల్ స్కూలు వెళ్లేందుకు ఎక్కాడు. హైవే మీదుగా వెళ్తుండగా.. అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్న మినీ వ్యాన్ బైక్ను ఢీకొనడంతో బైక్పై ఉన్న జయకృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న మధు కూడా తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి జయకృష్ణ మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.