దంపతులపై దాడి

ABN , First Publish Date - 2023-02-01T23:28:48+05:30 IST

ప్రేమ జంటపై పెద్దలు దాడి చేసిన ఘటన మదిరెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

   దంపతులపై దాడి

రాళ్లతో దాడి చేసిన యువతి తల్లిదండ్రులు

నలుగురిపై కేసు నమోదు

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 1: ప్రేమ జంటపై పెద్దలు దాడి చేసిన ఘటన మదిరెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిక్కస్వామి ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన తాయమ్మను పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి కపటి గ్రామంలో ఉంటూ అ జంట జీవనం సాగిస్తోంది. మూడు నెలల క్రితం వీరికి బిడ్డ పుట్టింది. దీంతో బుధవారం మదిరెలో చర్చిలో ప్రార్థన చేయించడానికి వెళ్లారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అక్కడకు చేరుకొని ఇంటికి రావాలని పిలించారు. వారు ససేమిరా అనడంతో తిక్కస్వామి, తాయమ్మపై రాళ్లతో దాడి చేసి గాయపర్చారు. దీంతో గ్రామస్థులు వీరిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రులు శంకరప్ప, వలయమ్మతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఇస్వీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఓబులేసు తెలిపారు.

Updated Date - 2023-02-01T23:28:50+05:30 IST