ఐదు సచివాలయాలకు ఇన్చార్జి అడ్మిన్లు
ABN , First Publish Date - 2023-01-25T00:33:43+05:30 IST
నగర పాలక సంస్థ పరిధిలోని ఐదు సచివాలయాలకు ఇన్చార్జి అడ్మిన్లను నియమిస్తూ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు(న్యూసిటీ), జనవరి 24: నగర పాలక సంస్థ పరిధిలోని ఐదు సచివాలయాలకు ఇన్చార్జి అడ్మిన్లను నియమిస్తూ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు అడ్మిన్లు సెలవులో ఉన్న కారణంగా ఆ సచివాలయాలకు ఇతర సచివాలయాల నుంచి ఇన్చార్జిలను నియమించారు. 43వ వార్డు 111, 112 సచివాలయాలకు కే.లలిత, సీహెచ్.గోవర్ధన్, 24 వార్డు 62 సచివాలయానికి ఎం.విజయ, 4వ వార్డు 9వ సచివాలయానికి ఎస్.శ్రీజ, 28వ వార్డు, 136వ సచివాలయానికి రమేష్ యాదవ్ను నియమించారు.