లంక భూముల పరిశీలన
ABN , First Publish Date - 2023-01-25T00:27:54+05:30 IST
మండల పరిధిలో లంక భూములను మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.
మూలపాడు(ఇబ్రహీంపట్నం), జనవరి 24: మండల పరిధిలో లంక భూములను మంగళవారం జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. లంక భూములను సాగుచేస్తున్న అర్హులైన అనుభవదారులకు డీ ఫారం పట్టాలు మంజూరుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం 799 అనుసరించి సి తరగతిలో ఉన్న లంక భూములను ఎ/బి మార్పునకు పంపిన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్కలెక్టర్ అదితి సింగ్ ఇబ్రహీంపట్నం, జూపూడి, మూలపాడు, త్రిలోచనాపురం, కొటికలపూడి లంక భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లంక భూముల సాగు రైతుల నుంచి వివరాలు సేకరించారు. తహసీల్దార్ సూర్యారావు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
కంచికచర్ల రూరల్: గనిఆత్కూరు గ్రామంలో లీజు లంక భూములను అర్హులైనవారికి మంజూరు చేసేందుకు బుధవారం జేసీ సదరు భూములను తనిఖీ చేశారు. పరిశీలించి పూర్తి విచారణ అనంతరం అర్హులకు అందించటం జరుగుతుందని జేసీ చెప్పారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో రవీంద్ర, తహసీల్దార్లు నరసింహారావు, రాజకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.