మత్తు అనర్థాలపై అవగాహన

ABN , First Publish Date - 2023-01-26T01:01:43+05:30 IST

మత్తు పదార్థలకు బానిసలై అనేక మంది జీవి తాలను నాశనం చేసుకుంటున్నారని నవజీవన్‌ బాలభవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గొళ్లమూడి శేఖర్‌బాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్స్‌కు మత్తు పదార్థాల అనర్థాలు.. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహిం చారు.

 మత్తు  అనర్థాలపై అవగాహన

మత్తు అనర్థాలపై అవగాహన కల్పిస్తున్న జోనల్‌ కో- ఆర్డినేటర్‌ శ్రీవల్లి

గన్నవరం, జనవరి 25 : మత్తు పదార్థలకు బానిసలై అనేక మంది జీవి తాలను నాశనం చేసుకుంటున్నారని నవజీవన్‌ బాలభవన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ గొళ్లమూడి శేఖర్‌బాబు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్స్‌కు మత్తు పదార్థాల అనర్థాలు.. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై బుధవారం వర్క్‌షాప్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా శేఖర్‌బాబు మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపిం చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవటం వల్ల చెడుమార్గం వైపు వెళుతున్నారని చెప్పారు. సైకాలిజిస్టు జి.అనూష, జోనల్‌ కో-ఆర్డినేటర్‌ డి.శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:01:45+05:30 IST