PawanKalyan: జనసేనకు కార్యకర్తలే బలం... వారే సంపద

ABN , First Publish Date - 2023-02-03T10:52:13+05:30 IST

మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

PawanKalyan: జనసేనకు కార్యకర్తలే బలం... వారే సంపద

అమరావతి: మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief PawanKalyan) పిలుపునిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జనసేన పార్టీ (Janasen Party)కి కార్యకర్తలే బలం.. వారే తమ సంపద అని అన్నారు. రెండు విడతలుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతమైందని తెలిపారు. మూడో విడతగా ఈ నెల 10న మొదలై 28 వరకు సాగుతోందన్నారు. గత రెండు విడతల్లో ఎంతో కష్టపడిన 6,400 మంది వాలంటీర్లను జనసేనాని అభినందించారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద బీమా నమోదు నిమిత్తం తన వంతుగా రెండు విడతల్లోనూ రూ.2 కోట్లు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. మూడో విడతలోనూ విరాళం అందిస్తానని ప్రకటించారు. మూడో విడతలోనూ అంతా సమష్టిగా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయాలని పవళ్ కళ్యాణ్ కోరారు.

Updated Date - 2023-02-03T10:52:25+05:30 IST